*"యాత్రికుని ప్రయాణం" పుస్తక రచయిత జాన్ బన్యన్ గారి గురించి*
👉చిన్న వయస్సులోనే అబద్ధములు, దొంగతనములు వంటి అనేక చెడ్డ అలవాట్లకు గురై, చదువులో ముందుకు సాగలేకపోయిన ఆ యువకుడు సైన్యములో చేరెను. ఒకసారి యుద్ధములో తాను వెళ్ళవలసిన డ్యూటీకి మరొక వ్యక్తి వెళ్ళెను.అతడు అక్కడ మరణించెను. దేవుడు ఎదో ఒక ఉద్దేశ్యంతో తనను మరణము నుండి తప్పించెనని గ్రహించి, సైన్యములో నుండి బయటికి వచ్చిన తరువాత పాత్రలకు మాట్లు వేసి, బాగు చేయు కమ్మరి వృత్తిని ప్రారంభించెను.
👉ఎప్పుడూ పాపపు తీర్పు యొక్క భీతితో సమాధానము లేని జీవితం జీవిస్తున్న అతనిని ఒక ఫాదిరి గారికి పరిచయం చేయగా, యేసుక్రీస్తు పాపములను క్షమించుటకు అధికారం గలవాడని, ఆయనిచ్చు రక్షణ ఉచితమని చెప్పిన మాటలు అతడంగీకరించి, అతని హృదయంలో విశ్వసించి తన పాపముల కొరకు పశ్చాత్తాపపడి, రక్షించబడెను. అంతేగాక, ఈ గొప్ప రక్షణ సువార్తను పాపములో నశించిపోతున్న అనేకులకు చెప్పాలన్న ఆశతో సువార్త ప్రకటించుట ఆరంభించెను.అతడే జాన్ బన్యన్!
👉ఆదినాల్లో అభిషేకించబడినవారు తప్ప ఎవరూ ప్రసంగించకూడదు అన్న చట్టమున్నందున ఆయనను బంధించి, చెరసాలలో పెట్టిరి! మరెన్నడూ ప్రసంగించనని ప్రమాణం చేస్తే విడుదల చేస్తామన్నప్పటికీ, జాన్ బన్యన్ ప్రమాణం చేయుటకు నిరాకరించుటే గాక, "ఈ రోజు విడుదల చేస్తే, రేపే ప్రసంగిస్తానని చెప్పాడు. దేవునికి అవిధేయుడగుట కంటె, చెరసాలలో నా కండ్లపై నాచు పెరిగేవరకు ఉన్నా నాకు మేలే" అనేవాడు!
👉ఆలాగు ఎంతో మురికిగా, చీకటిగా ఉన్న ఆ చెరసాలలో 12 సం||లు ఉండెను.ఆ 12 సం||లలో తన సమయాన్ని ఏ మాత్రము వృథా పరచుకొనక, తన తోటి ఖైదీలకు సువార్త ప్రకటిస్తూ, ప్రతి నిముషము ప్రార్ధన, ధ్యానములలో గడిపెను.అంతేగాక, నేటికినీ ప్రపంచంలో గొప్ప పేరు పొందిన, వంద భాషలలో తర్జుమా చేయబడిన యాత్రికుని ప్రయాణము" అనే పుస్తకమును చెరసాలలో ఉండగా, తనకు కలిగిన ప్రత్యక్షతలను బట్టి వ్రాసెను.జైలు నుండి బయటికి వచ్చిన తరువాత మరనేక పుస్తకములనువ్రాసెను,సంఘకాపరిగా పని చేసెను, అనేక ఆత్మలను సంపాదించెను. చివరికి తన 60వ యేట ఈ లోకాన్ని విడిచి ప్రభువు సన్నిధికి వెళ్ళేను.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి