📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 ♻️ *ప్రపంచ జాతుల ఆవిర్భావం*♻️ 👉జలప్రళయం గతించిన తరువాత నోవహు కుమారులైన షేము,హాము,యాపేతుల వంశావళి నుండి ప్రపంచంలోని వివిధ దేశాలు జాతులు ఉద్భవించాయి. ఆదికాండం 10వ అధ్యాయం లో ఈ విషయాలన్నీ గమనించగలం. ప్రపంచ దేశాల ఆవిర్భావం నోవహు కుమారులనుండే జరిగింది. 👉జలప్రళయం తర్వాత చరిత్ర నిర్మాతలు నోవహు కుమారులే. వీరి నుండి వచ్చిన జనంగాలే ఆ తదుపరి ప్రపంచమంతా వ్యాపించారు. 👉 *షేము* షేము సంతానాన్ని సెమిటిక్కులు అంటారు. వీరు గురించిన అధ్యాయాన్ని సెమిటిజం అంటారు. వీరు కొండ ప్రాంతాంల్లో నివాసం ఉండేవారు. ఆసియా వారు వీరి నుండి వచ్చిన వారు. 👉 ఆదికాండం 10వ అధ్యాయం 21- 30 వరకు హేమ సంతానముల గురించి వ్రాయబడింది. 👉 షేము సంతానంలో గుర్తింపదగిన వారు ఎందరో ఉన్నప్పటికీ అతి ప్రాముఖ్యమైన వారు కొందరున్నారు. ఏలాము =ఇరాన్ అష్షూరు = ఉత్తర ఇరాక్ అర్పక్షదు= సిరియా 👉 అర్పక్షదు సంతానంలో సరిగ్గా పదవ తరం నుండి అబ్రహాము వచ్చెను. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఈ సంతానము నుండి వచ్చెను గనుక ఇది ప్రత్యేకమైనద...