ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అక్టోబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రపంచ క్రైస్తవ్యానికి సంబంధించిన తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన సత్యాలు...*

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *ప్రపంచ క్రైస్తవ్యానికి సంబంధించిన తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన సత్యాలు...*  ఈ విలువైన సమాచారాన్ని మీకందిస్తున్నవారు  ట్రుథ్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇండియా... ★ప్రపంచంలో అతి పెద్ద మతంగా కొనసాగుతున్న క్రైస్తవ్యన్ని, అనుసరిస్తున్నవారి సంఖ్య అధికారిక గణాంకాల ప్రకారం 240 కోట్లు కాగ, ఇది ప్రపంచ జనాభాలో 33% శాతం... కానీ చాలా ప్రాంతాల్లో క్రైస్తవులకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల కారణంగా బాహ్యంగా క్రైస్తవులు కనిపించట్లేదు గానీ అనధికారికంగా ఈ సంఖ్యకు మించి క్రైస్తవులున్నారు... అలాగే 23 కోట్లా క్రైస్తవ జనాభాతో అమెరికా అగ్ర క్రైస్తవ దేశంగా నిలువుగా , 19 కోట్లా క్రైస్తవ జనాభాతో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది... ★ ప్రపంచ క్రైస్తవ్యంలో వివిధ మతాచారా శాఖలున్నాయి, వీటినే డినమినేషన్స్ అంటారు, వీటిల్లో క్యాథలిక్ శాఖ వారు 120 కోట్ల అనుచరులతో అంటే ప్రపంచ క్రైస్తవ జనాభాలో 50%శాతంతో ముందంజలో ఉండగా,  80 కోట్లా అనుచరులతో ప్రొటెస్టెంట్ శాఖ వారు ద్వితీయస్థానంలో,  28.5 కోట్లా అనుచరులతో అర్ధోడక్స్ శాఖ వారు మూడవ స్థానంలో వున్నారు... ఇలా చూసుకుంటుపోతే ఇంకా ఇతరత...

2 దినవృత్తాంతాలు

2 దినవృత్తాంతాలు పరిచయం రచయిత, వ్రాసినకాలం: 1 దినవృత్తాంతాలు పరిచయం చూడండి. ముఖ్యాంశాలు: సొలొమోను మొదలుకొని జెరుసలం పతనం వరకు యూదా రాజుల చరిత్రలోని కొన్ని సంఘటనలు. ఈ పుస్తక కాలవ్యవధి 1,2 రాజుల పుస్తకం కాలావధి ఒకటే – 384 సంవత్సరాలు. ఈ పుస్తకాన్ని వాటితో సరిపోల్చవచ్చు. అయినా గాని 2 దినవృత్తాంతాలు యూదా చరిత్రను ఎక్కువగా వివరిస్తూ ఉత్తర రాజ్యమైన ఇస్రాయేల్‌ను చాలామట్టుకు విస్మరిస్తుంది. యూదాతో సంబంధించిన విషయాలలో మాత్రం ఇస్రాయేల్‌ను గురించి ప్రస్తావించడం జరిగింది. దావీదుతోను అతని సంతతితోను దేవుడు చేసిన ఒడంబడికను కొనసాగించడంలో దేవుడు నమ్మకస్థుడుగా ఉన్నాడని చూపించడమే ఈ పుస్తక రచయిత ఉద్దేశమైనట్లు కనబడుతుంది. (1 దిన 17:11-14). 2 దినవృత్తాంతాలులోని విషయాలలో సుమారు సగంవరకు 1,2 రాజులు పుస్తకాలలో కనబడవు. విషయసూచిక సొలొమోను పరిపాలన 1:1—9:31 జ్ఞానాన్ని ఇమ్మని సొలొమోను దేవుణ్ణి అడిగాడు 1:7-12 దేవాలయం కట్టడానికి సొలొమోను ఏర్పాట్లు 2:1-18 సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు 3:1—5:1 లేవీవారు మందసాన్ని దేవాలయానికి తీసుకువచ్చారు 5:2-14 దేవుని మహిమ దేవాలయాన్ని ఆవరించింది 5:13-14 సొలొమోను ప్రజలకు చెప్పిన మాటలు 6...

1 దినవృత్తాంతాలు

1 దినవృత్తాంతాలు పరిచయం పేరు: హీబ్రూ బైబిలులో 1,2 దినవృత్తాంతాలు ఒకే పుస్తకంలా కలిసివుండేవి. అయితే యూదులు పండితులు పాత ఒడంబడికను గ్రీకు భాషలోకి అనువదించేటప్పుడు దానిని రెండుగా విడదీశారు. రచయిత: యూదుల సాంప్రదాయం ప్రకారం ఎజ్రా 1,2 దినవృత్తాంతాలను వ్రాశాడు (ఎజ్రా, నెహెమ్యా పుస్తకాలను కూడా). వ్రాసిన కాలం: బహుశా క్రీ.పూ. 450-430 మధ్యకాలంలో వ్రాసి ఉండాలి. ముఖ్యాంశాలు: ఇస్రాయేల్‌వారు ఏ వంశం నుండి వచ్చారో తెలియజేసే వంశావళులు అబ్రాహాము, నోవహు, ఆదాము వరకు చేరుతున్నాయి.  ఈ పుస్తకం వివరించే సంఘటనలు చాలమట్టుకు  దావీదు జీవితానికి సంబంధించినవే. ఈ రీతిగా చూస్తే దీనిని 2 సమూయేలు పుస్తకంతో సరిపోల్చవచ్చు. ఈ పుస్తకం దావీదు గొప్పతనాన్ని ఎత్తి చెప్తున్నదే గాని అతడు చేసిన పాపం, పొందిన శిక్షను గురించి చెప్పేది చాలా తక్కువ. బెత్‌షెబతో అతడు చేసిన పాపం, అలాగే అతనిపై అబ్‌షాలోం చేసిన తిరుగుబాటును గురించిన మాట ఏమీ లేదు.  యెహోవా దేవునితో తమకు సరియైన సంబంధం ఉన్నప్పుడే యూదులు తమ దేశ ఉన్నతినీ మహిమనూ అనుభవించగలరని ఈ పుస్తకం నేర్పుతుంది. విజయాన్ని, దీవెనలను పొందడానికి యెహోవాకు లోబడడమే మూలసూత్రం. విషయసూచిక: ...

2 రాజులు

2 రాజులు పరిచయం రచయిత, వ్రాసిన కాలం: 1 రాజులు పరిచయం చూడండి.  ముఖ్యాంశాలు: ఇస్రాయేల్, యూదా రాజ్యాలు పతనమయ్యేంతవరకు వాటి చరిత్రలోని కొన్ని సంఘటనలు,  - ప్రవక్త ఎలీషా విశేష సేవ,  - యూదాలో ఉజ్జీవ సమయాలు, -  అష్షూరుకు ఇస్రాయేల్ చెర,  - జెరుసలం పతనం.  ఈ పుస్తకంలో వివరించినవి 266 సంవత్సరాల కాలవ్యవధిలో జరిగాయి. విషయసూచిక : - రాజైన అహజ్యా అపఘాతం 1:1-8 ఏలీయా, రాజ ప్రతినిధులు, రాజు మరణం 1:9-18 ఏలీయా శరీరంతోనే పరమునకు వెళ్ళడం 2:1-12 ఏలీయా తరువాత ఎలీషా సేవను కొనసాగించడం 2:13-18 చేదు నీటిని ఎలీషా బాగు చేయడం 2:19-22 ఎలీషా, యువకులు, ఎలుగుబంట్లు 2:23-25 ఇస్రాయేల్‌కు దుష్ట రాజైన యెహోరాం, మంచి రాజైన యెహోషాపాతు మోయాబుకు విరుద్ధంగా చేతులు కలపడం 3:1-27 ఎలీషా అద్భుత కార్యాలు 4:1—6:23 విధవరాలికి నూనె 4:1-7 షూనేంస్త్రీ కొడుకును బ్రతికించడం 4:8-37 పెద్ద కుండలో కూరవంట 4:38-41 నూరుమందికి భోజనం 4:42-44 నయమాను వ్యాధిని బాగు చేయడం 5:1-19 గేహజీని దురాశ చూడడం 5:20-27 తేలిన గొడ్డలి 6:1-7 సిరియా సైన్యం గురించిన సంగతి 6:8-23 బెన్‌హదదుతో ఇస్రాయేల్ యుద్ధం, అద్భుతరీతిగా విడుదల 6:24—7:20 షూనేం వి...

1 రాజులు

1 రాజులు పరిచయం పేరు: మొదట హీబ్రూ బైబిలులో 1, 2 రాజులు పుస్తకాలు ఒకటిగా ఉండేవి. పాత ఒడంబడికను గ్రీకు భాషలోకి తర్జుమా చేసేటప్పుడు దానిని రెండుగా విభజించడం జరిగింది. రచయిత, వ్రాసినకాలం: యూదుల సాంప్రదాయం ప్రకారం ప్రవక్త అయిన యిర్మీయా ఈ పుస్తకాన్ని రాశాడు. అయితే అలా అనడానికి ఇప్పుడు సాక్ష్యాధారాలు లేవు. బహుశా యూదులు బబులోను చెరలోకి వెళ్ళిన కొద్దికాలం తరువాత ఈ పుస్తకాన్ని వ్రాయడం జరిగి ఉండవచ్చు. ముఖ్యాంశాలు: దావీదు మొదలుకొని యెహోషాపాతు అహాబువరకు ఉన్న రాజుల చరిత్రను ఈ పుస్తకం ముందుకు కొనసాగిస్తుంది.  కొన్ని ముఖ్య సంఘటనలు:  - సొలొమోను దేవాలయాన్ని కట్టించడం,  - యూదుల గోత్రాలు రెండు రాజ్యాలుగా విడిపోవడం, - - - ఉత్తర రాజ్యం అతి త్వరగా విగ్రహ పూజకు, అవినీతికి దిగజారిపోవడం, -  ప్రవక్త ఏలీయాద్వారా గణించదగ్గ సేవ, మొదలైనవి.  1 రాజులలోని సంఘటనల కాలవ్యవధి 118 సంవత్సరాలు. విషయసూచిక: - రాజుగా సొలొమోను 1:1—11:43 దావీదు చివరి దినాలు, అదోనీయా రాజు కావడానికి ప్రయత్నాలు 1:1-10 దేవుడు, దావీదు ఎన్నిక చేసినది సొలొమోనును 1:11-40 సొలొమోనుకు దావీదు చివరి ఉపదేశం 2:1-9 దావీదు మరణం 2:10-11 సొలొ...

2 సమూయేలు

2 సమూయేలు పరిచయం రచయిత, వ్రాసిన కాలం: 1 సమూయేలు పరిచయం చూడండి.  ముఖ్యాంశాలు: యూదా ఇస్రాయేల్‌ల పై దావీదు ఏలుబడి. దాని విజయం, పేరుప్రఖ్యాతులు, దావీదుతో దేవుని ఒడంబడిక, దావీదు చేసిన పాపం, అతనికి వచ్చిన శిక్ష. విషయసూచిక : - సౌలు, యోనాతానుల మరణం గురించి దావీదు వినడం 1:1-16 దావీదు విలాపం 1:17-27 దావీదు యూదాలో తన పరిపాలనను ఆరంభించడం 2:1-7 అబ్నేరుతో యుద్ధం 2:8-32 హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారులు 3:2-5 అబ్నేరు దావీదు పక్షంలో చేరడం 3:6-21 యోవాబు అబ్నేరును చంపడం 3:21-39 సౌలు కుమారుడైన ఇష్బోషెతు హత్య 4:1-12 దావీదు ఇస్రాయేల్‌మీద రాజు కావడం 5:1-5 దావీదు జెరుసలం వశపరచుకొని దానిని తన స్వంత పట్టణం చేసుకోవడం 5:1-16 దావీదు ఫిలిష్తీయవారిని ఓడించడం 5:17-25 దావీదు మందసాన్ని జెరుసలంకు తీసుకురావడం 6:1-23 దేవాలయం కట్టాలని దావీదు కోరిక 7:1-7 దావీదుతో దేవుని ఒడంబడిక 7:8-16 దావీదు ప్రార్థన 7:17-29 దావీదు చేసిన యుద్ధాలు, అతని అధికారాలు 8:1-18 యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు పట్ల దావీదు చూపించిన దయ 9:1-13 దావీదు అమ్మోన్‌వారిని సిరియవారిని ఓడించడం 10:1-19 బత్‌షెబతో దావీదు చేసిన పాపం 11:2—12:24 పాపం. 11:2-5 ఊరి...

1 సమూయేలు పరిచయం

1 సమూయేలు పరిచయం రచయిత: - తెలియదు. వ్రాసిన కాలం: మొదటిలో 1,2 సమూయేలు పుస్తకాలు ఒకటిగా ఉండేవి. పాత ఒడంబడికను గ్రీకు భాషలోకి అనువదించినప్పుడు అనువాదకులు ఈ పుస్తకాన్ని రెండుగా విభజించారు.  1 సమూ 27:6లో రచయిత విడిపోయిన రాజ్యాన్ని సూచించగల యూదా రాజులను గురించి వ్రాస్తున్నాడు కాబట్టి, అతడు ఈ పుస్తకాలను సొలొమోను మరణించిన తరువాతనే వ్రాసి ఉండాలి అని చెప్పవచ్చు. సొలొమోను కుమారుడు రెహబాం కాలంవరకు రాజ్యం విడిపోలేదు. ముఖ్యాంశాలు: 1) న్యాయాధిపతులలో లేక నాయకులలో సమూయేలు అత్యంత ఘనుడు. 1 సమూయేలులో అతని పుట్టుక, జీవితం, అతడు చేసినపని ఒక ముఖ్యాంశంగా ఉంది.  2) మరొక ముఖ్యాంశం ఇస్రాయేల్‌వారు తమకు దేవుడు రాజుగా ఉండడానికి ఒప్పుకోకుండా ఒకతణ్ణి రాజుగా నియమించుకోవడం.  3) మరో ముఖ్యాంశం: దావీదు జీవితంలోని ఆరంభ దశను మొదలుకొని సౌలు మరణించేంతవరకు జరిగిన సంగతులు. బైబిలులోని మిగతా భాగాలలాగే ఈ పుస్తకంలో నుండి కూడా ఇప్పటి విశ్వాసులు గ్రహించవలసిన ఆత్మసంబంధమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి (2 తిమోతి 3:16-17). విషయసూచిక: - సమూయేలు తల్లి హన్నా 1:1-20 సమూయేలు పుట్టుక, బాల్యం 1:20-28 హన్నా గీతం 2:1-10 భక్తిహీనులైన ఏలీ కుమ...

రూతు. పరిచయం

రూతు పరిచయం రచయిత, వ్రాసిన కాలం: - యూదుల సాంప్రదాయం ప్రకారం సమూయేలు ఈ పుస్తకాన్ని వ్రాశాడు, అయితే అలా అనడానికి సాక్ష్యాధారాలు లేవు. అలాగే ఏ కాలంలో దీనిని వ్రాయడం జరిగిందో కూడా ఖచ్చితంగా చెప్పలేము. ముఖ్యాంశాలు: - ఒక ముఖ్యాంశం వ్యక్తులమధ్య ఉన్న దయ, ప్రేమ, వాటి ఫలితాలు.  - మరో ముఖ్యాంశం – ఇతర ప్రజలలో ఒకరైన రూతు యెహోవాను విశ్వసించి దేవుని ప్రజలలో ఒకరు కావడం. రూతు దేవుని రాజ్యంలో ప్రవేశించడం మాత్రమే కాకుండా, దావీదుకు ప్రభువైన యేసుకు పూర్వ జనని అయింది.  - మరో ముఖ్యాంశం – విడిపించగల బాధ్యతగల సమీప బంధువు. ‘విడిపించగల బంధువు’ క్రీస్తును పోలిన నమూనాలో ఉన్నాడు. 2:20 దగ్గర ఉన్న నోట్‌ను చూడండి. 2:20 లో ఉన్న నోట్  : - { సమీప బంధువుడు”– ఈ చిన్న పుస్తకంలోని మరో పెద్ద అంశం ఇది. “గొయేల్” అనే ఒక్క హీబ్రూ పదానికి అనువాదం “విడిపించగల బంధువు” లేక “విమోచకుడు” లేక “సమీప బంధువుడు” లేక “ముక్తిదాత”. “పగ తీర్చుకొన్నవాడు” “ప్రతీకారం చేసేవాడు” అని కూడా ఈ పదం అనువదించబడింది. ఈ అర్థాలన్నీ ఈ పదంలో ఉన్నాయి. ఈ సమీపబంధువుడి బాధ్యతలు లేవీ 25:25-28, 47-49; సంఖ్యా 35:19-21; ద్వితీ 25:5-10లో కనిపిస్తాయి. న్యాయా...

న్యాయాధిపతులు. పరిచయం

న్యాయాధిపతులు పరిచయం పేరు: “న్యాయాధిపతులు” అని అనువదించిన హీబ్రూ పదానికి “నాయకులు” అనే అర్థం కూడా ఉంది. ఈ పుస్తకానికి “నాయకులు” అని పేరు పెట్టడమే ఎక్కువ సమంజసంగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఎన్నుకొన్న నాయకులు ప్రజలకు తీర్పు చెప్పడంకంటే మించినదానినే చేశారు. బైబిలు పుస్తకాల పేర్ల గురించి ఆదికాండం పరిచయం చూడండి. రచయిత: యూదుల సాంప్రదాయం ప్రకారం సమూయేలు ఈ పుస్తకాన్ని వ్రాశాడు. అయినా అలా చెప్పడానికి ఖచ్చితమైన రుజువు లేదు. వ్రాసినకాలం: సుమారు క్రీ.పూ. 1000లో. ముఖ్యాంశం: ఈ పుస్తకంలో యెహోషువ మరణం మొదలుకొని సమూయేలు జన్మం వరకు ఇస్రాయేల్ చరిత్రలోని కొన్ని సంఘటనల వివరణ ఉంది. ఏ ప్రజలైనా గాని దేవునికిష్టమైనదానిని చేయడానికి బదులు వారికిష్టమైనదానిని చేస్తే ఏమవుతుందో ఈ పుస్తకం తెలియజేస్తుంది. అసహ్యమైన పనుల దోషం ప్రజలమీద ఉన్నప్పటికీ వారిపట్ల దేవుడు చూపే కనికరం, చేసే సహాయం గురించి కూడా ఇది తెలియజేస్తుంది. పాపాన్ని దేవుడు ఎంతగా ద్వేషిస్తాడు, దానిని ఎలా శిక్షిస్తాడు అనే సంగతులను గురించి కూడా తెలియజేస్తుంది. మరో దృక్కోణంలో చూస్తే అయోగ్యులైన ప్రజలను దేవుడు ఎలా విడిపించాడు, మహా శూరులైన వ్యక్తులను ఎలా వాడుకున...

యెహోషువ. పరిచయం

యెహోషువ పరిచయం రచయిత: యూదుల సాంప్రదాయాల ప్రకారం 24:29-33 మినహాయిస్తే ఈ పుస్తకానికి రచయిత యెహోషువే. యెహోషువ ఈ పుస్తకాన్ని రచించాడనడానికి పుస్తకంలోనే సాక్ష్యాధారాలున్నాయి. చూడండి 24:26. 5:1 కూడా చూడండి “మేము దాటే వరకు ఇస్రాయేల్ ప్రజల ముందు ఎండిపోయేలా” అనే వచనంలో “మేము” అనే పదాన్ని గమనించండి. యెహోషువ మోషేతో ఈజిప్ట్‌నుండి బయటకు వచ్చి ఎడారిప్రాంతాలలో మోషేతోను ఇస్రాయేల్‌తోను 40 సంవత్సరాలు గడిపాడు.  అతడు యుద్ధంలో ఆరితేరిన నాయకుడు (నిర్గమ 17:8-13).  అంతేకాదు అతడు విశ్వాసపరుడు, నమ్మకస్థుడు (సంఖ్యా 14:6-9).  యెహోషువ అనే పేరుకు అర్థం – “యెహోవా రక్షణను ఇస్తాడు” లేక “యెహోవా జయాన్ని కలుగజేస్తాడు”. వ్రాసిన కాలం: కనానును వశపరచుకోవడం అనేది బహుశా సుమారు క్రీ.పూ. 1406లో జరిగి ఉండాలి. దేశాన్ని చాలమట్టుకు వశపరచుకోవడం జరిగిన తరువాత అతని జీవిత అంత్యదశలో యెహోషువ ఈ పుస్తకాన్ని వ్రాసి ఉండాలి. ముఖ్యాంశాలు: దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని దేవుని ప్రజలు స్వాధీనం చేసుకోవడం, దేవుడు వారికి అందించిన విజయం, కనాను కోసం పోరాడడంలో వారు నేర్చుకొనిన పాఠాలు. ఇప్పటి విశ్వాసుల కోసం ఈ పుస్తకంలో ఆత్మ సంబంధమైన పాఠాలు...

ద్వితీయోపదేశకాండం (ధర్మోపదేశం)పరిచయం

ద్వితీయోపదేశకాండం (ధర్మోపదేశం) పరిచయం పేరు: యూదులు ఈ పుస్తకాన్ని మొదటి వచనాన్నిబట్టి “మాటలు ఇవి” లేదా కేవలం “మాటలు” అని పిలిచేవారు. ఆదికాండం పరిచయం చూడండి. రచయిత, వ్రాసిన కాలం: ఆదికాండం పరిచయం చూడండి. ముఖ్యాంశం: ఇది జ్ఞాపకాల పుస్తకం (1:3; 4:9-10, 23, 31; 5:15; 6:12; 7:18; 8:2, 11, 14, 18, 19; 9:7; 11:2; 15:15; 16:3; 24:9; 25:19). పర్వతం మీద దేవుడిచ్చిన ధర్మశాస్త్రం గురించి మళ్ళీ చెప్పడం, ఇస్రాయేల్‌తో దేవుని ఒడంబడికను మళ్ళీ స్థిరపరచడం, ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలూ బాధ్యతలూ తేటగా, పూర్తిగా రాసి ఉన్నాయి.  ప్రత్యేకంగా దేవుడు తనకూ ఇస్రాయేల్‌కూ మధ్య ఉన్న ప్రేమ బంధం గురించి నొక్కి చెప్తున్నాడు (4:37; 6:5; 7:8, 13; 10:12, 15; 19:9; 30:6, 16, 19, 20; 33:3).  విగ్రహపూజ విషయంలో ఇస్రాయేల్‌కు ఉన్న బలహీనతను తెలిసిన దేవుడు వారిని చాలా బలమైన మాటలతో హెచ్చరిస్తూ విగ్రహాలనుంచీ ఇతర దేవుళ్ళనుంచీ దూరంగా ఉండాలని చెప్తున్నాడు (6:14-15; 7:4; 8:19-20; 11:16; 13:1-18; 17:2-7; 27:15; 29:17-18; 30:17-18) విషయసూచిక సీనాయి పర్వతం నుంచి కనాను సరిహద్దుల వరకు ఇస్రాయేల్‌వారు సాగించిన ప్రయాణ...

ప్రపంచ క్రైస్తవ్యానికి సంబంధించిన తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన సత్యాలు...*

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *ప్రపంచ క్రైస్తవ్యానికి సంబంధించిన తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన సత్యాలు...*  ఈ విలువైన సమాచారాన్ని మీకందిస్తున్నవారు  ట్రుథ్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇండియా... ★ప్రపంచంలో అతి పెద్ద మతంగా కొనసాగుతున్న క్రైస్తవ్యన్ని, అనుసరిస్తున్నవారి సంఖ్య అధికారిక గణాంకాల ప్రకారం 240 కోట్లు కాగ, ఇది ప్రపంచ జనాభాలో 33% శాతం... కానీ చాలా ప్రాంతాల్లో క్రైస్తవులకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల కారణంగా బాహ్యంగా క్రైస్తవులు కనిపించట్లేదు గానీ అనధికారికంగా ఈ సంఖ్యకు మించి క్రైస్తవులున్నారు... అలాగే 23 కోట్లా క్రైస్తవ జనాభాతో అమెరికా అగ్ర క్రైస్తవ దేశంగా నిలువుగా , 19 కోట్లా క్రైస్తవ జనాభాతో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది... ★ ప్రపంచ క్రైస్తవ్యంలో వివిధ మతాచారా శాఖలున్నాయి, వీటినే డినమినేషన్స్ అంటారు, వీటిల్లో క్యాథలిక్ శాఖ వారు 120 కోట్ల అనుచరులతో అంటే ప్రపంచ క్రైస్తవ జనాభాలో 50%శాతంతో ముందంజలో ఉండగా,  80 కోట్లా అనుచరులతో ప్రొటెస్టెంట్ శాఖ వారు ద్వితీయస్థానంలో,  28.5 కోట్లా అనుచరులతో అర్ధోడక్స్ శాఖ వారు మూడవ స్థానంలో వున్నారు... ఇలా చూసుకుంటుపోతే ఇంకా ఇతరత...

అపో.తోమా జీవితము గురించి క్లుప్తంగా

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 ♻ *అపో.తోమా జీవితము గురించి క్లుప్తంగా....* 👉 భారత్ లో మొట్టమొదటి అతి పురాతనమైన చర్చ్ మాలబరో సెయింట్ థామస్ కెథడ్రల్ దీన్ని అపొస్తలుడైన తోమా క్రీ.శ.52లో నిర్మించాడు. ఈ చర్చ్ గురించి తెలుసుకోవలాంటే ముందుగా భారతదేశంలోకి క్రైస్తవ్యం ఏవిదంగా వచ్చిందో తెలుసుకోవాలి. 👉 యేసు క్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడైన తోమా గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టువాడై ఉండెను. ఈయన తోమా దిదుమగా పిలువబడేవాడు. తోమా అను మాటకు అరామిక్ భాషలో కవలలు అని అర్థము. దిదుమ అను మాటకు గ్రీకు భాషలో కవలలు అని అర్థము. కాబట్టి తోమా కవల పిల్లలలో ఒకరు అని బైబిల్ పండితుల అభిప్రాయం. మరికొందరు యిది ఆయన బిరుదు అనియు, ఆయన అసలైన పేరు యూదా తోమా అనియు భావించుచున్నారు. 👉 *యోహాను తోమాకు బాల్యమిత్రుడు కావడం వల్ల తన సువార్తలో చాలా వివరంగా తోమా గురించి వ్రాసాడు.* 👉 మొట్టమొదటగా తోమాను గురించి యోహాను సువార్త 11:16 లో చూడగలం. యేసు లాజరును చూడగోరి యూదయ బయలుదేరుటకు తీర్మానించినప్పుడు, ప్రాణాపాయము సంభవించునని శిష్యులు సంశయించిరి. అప్పుడు యేసు లాజరు చనిపోయాడని స్పష్టంగా చెప్పాడు. “ఆయనతో కూడా చనిపోవుటక...

నోవాహు ఓడ ఘట్టం నిజమేనా ?

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 ♻ నోవాహు ఓడ ఘట్టం నిజమేనా ??🌀 ♻ నోవాహు  నిజముగా భూమి పై ఉన్న జీవరసులన్నిటిని అందులో ఉంచగాలిగాడ ????🌀 ♻ నోవాహు ఓడ నిర్మాణం లో  ఉన్న అధ్బుత పరిజ్ఞానం ఏమిటి ??🌀 👉  ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే  , మొదట ఎన్ని జంతువులు ఓడ లో  ఉన్నాయో తెలుసుకోవాలి. విమర్శకులు మిలియన్ల కొద్దీ జంతువులను ఓడలో ఓవర్లోడింగ్ చేస్తున్నట్లు ఊహించారు. నిజానికి ఆ ఓడ జంతువులకు  కేవలము పరిమితకాలపు నివాసమునకు , స్వషేరుక జంతువుల (ఆధునిక పక్షులు, క్షీరదాలు మరియు సరీసృపాలు, అలాగే వారి అంతరించిపోయిన ప్రతిరూపాలు ) శ్వాసించడానికి గల అనుకూలతలు కలిగి ఉంటుంది . 👉............ఓడలో ప్రతి జీవి(ఇప్పుడు నివసించి ఉన్నవి ) ఉందా ??? అంటే లేదు అనే చెప్పాలి ఆది:6:19 మరియు నీతోకూడ వాటిని బ్రదికించి యుంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరులయొక్క ప్రతి జాతిలో నివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను; వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. 20 నీవు వాటిని బ్రది కించి యుంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువుల లోను, వాటి వాట...

క్రీస్తు సంఘము అంటే

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 ✝ *క్రీస్తు సంఘము అంటే ???????????????????*🤔 👉   గత కొన్ని రోజులుగా కొంతమంది క్రైస్తవులు క్రీస్తు సంగము అంటే వెళ్ళే సంఘానికి పేరు క్రీస్తు అని పెట్టుకుంటే అది మాత్రమె క్రీస్తు సంఘం అని వింత వాదనలు తెస్తున్నారు. అసలు క్రీస్తు సంగము అంటే పేరు ఉంటేనే అవుతుందా? క్రీస్తుని అనుసరించేవారు, క్రీస్తుని గురించి ప్రకటించేవారు, క్రీస్తు రక్తం లో తమను శుద్ధి చేసుకున్నవారు అందరు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమే. ఈ భూమి మీద మనుషులు ఏర్పాటు చేసుకొని పేరు పెట్టుకున్నంత మాత్రాన యేసు చేత చెప్పబడిన సంఘం అవ్వదు. క్రీస్తుని పోలి జీవించేవారు మాత్రమె క్రీస్తు సంఘానికి చెందినావారు. కొందరు ఏసుక్రీస్తుని శోధించిన పరిసయ్యలు, యూదులలాగా ప్రవర్తిస్తున్నారు. ఎలా అంటే బహ్యపరమైన ఆచారాల వలే. అందుకే ఆనాడు ఏసుక్రీస్తు వారిని వేశాదారులుగా, సున్నం కొట్టిన సమాదులుగా పోల్చాడు. ఏసుక్రీస్తు ని కూడా అయన చేసే ప్రతిపనిలో అడ్డుగా వచ్చి ఆయన్ని శోధిస్తూ ధర్మ శాస్త్రం లో ఇలా రాయబడి వుంటే నువ్వెందుకు అలా చేస్తున్నావు అని ref చూపించి అడిగినట్టు కొందరు కేవలం పేరుకు సంబంధించ...

దేవుని రాకడ ముందు జరుగుతున్న వింతలు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 🔘 *దేవుని రాకడ ముందు జరుగుతున్న వింతలు*🔘 💠 *ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి కోడులు మరియు గుర్తింపు వ్యవస్థలు*💠 👉  *【1.】 అంతర్జాతీయ గుర్తింపు వ్యవస్థలో జరుగుతున్న సన్నాహాలు మరింత ఊపందుకుంటాయని మనము తెలుసుకున్నాం.* 👉  *【2.】 గుర్తింపు కార్డులను తమ ప్రజలకు ఎన్నో దేశాలు ఇప్పటికే అందజేశాయి మరియు ఇతర దేశాలు కూడా అదే మార్గంలో ఇప్పుడు పయనిస్తున్నాయి.* 👉  *【3.】 పిల్లలు మరియు కుక్కల శరీరంలోకి ఇప్పటికే చిప్స్ చొప్పించడం జరిగింది.* 👉  *【4.】 బియ్యపు గింజ సైజులో స్మార్ట్ కంప్యూటర్ చిప్ అయినా బయోచిప్ సృష్టి ఇప్పటికే ఉన్న విషయాన్ని మనం చూశాం. దీనిని వ్యక్తి యొక్క చర్మము క్రింద అమర్చవచ్చు.* 👉  *【5.】 బయో చిప్లను ట్రాన్స్ పాండర్స్ అని కూడా పిలుస్తారు. ఇవి వివిధ పరిమాణాల్లో లభిస్తాయి. అతి చిన్న బయోచిప్ యొక్క సైజు బియ్యపు గింజ అంతగా 11 మిల్లీమీటర్లలలో (mm) ఉంటుంది. ఈ చిప్ పైభాగంలో గాజు ట్యూబ్ ఉంటుంది. లోపల ఒక చిన్న మైక్రోచిప్ ఉంటుంది. దానిలో గుర్తింపు సంఖ్య, కెపాసిటర్ మరియు ఆంటీనా కాయిల్స్ ఉంటాయి. ఇవి ఒక చిన్న రేడియో అంటీ...