📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
♻️ *ప్రపంచ జాతుల ఆవిర్భావం*♻️
👉జలప్రళయం గతించిన తరువాత నోవహు కుమారులైన షేము,హాము,యాపేతుల వంశావళి నుండి ప్రపంచంలోని వివిధ దేశాలు జాతులు ఉద్భవించాయి. ఆదికాండం 10వ అధ్యాయం లో ఈ విషయాలన్నీ గమనించగలం. ప్రపంచ దేశాల ఆవిర్భావం నోవహు కుమారులనుండే జరిగింది.
👉జలప్రళయం తర్వాత చరిత్ర నిర్మాతలు నోవహు కుమారులే. వీరి నుండి వచ్చిన జనంగాలే ఆ తదుపరి ప్రపంచమంతా వ్యాపించారు.
👉 *షేము*
షేము సంతానాన్ని సెమిటిక్కులు అంటారు. వీరు గురించిన అధ్యాయాన్ని సెమిటిజం అంటారు. వీరు కొండ ప్రాంతాంల్లో నివాసం ఉండేవారు. ఆసియా వారు వీరి నుండి వచ్చిన వారు.
👉 ఆదికాండం 10వ అధ్యాయం 21- 30 వరకు హేమ సంతానముల గురించి వ్రాయబడింది.
👉 షేము సంతానంలో గుర్తింపదగిన వారు ఎందరో ఉన్నప్పటికీ అతి ప్రాముఖ్యమైన వారు కొందరున్నారు.
ఏలాము =ఇరాన్
అష్షూరు = ఉత్తర ఇరాక్
అర్పక్షదు= సిరియా
👉 అర్పక్షదు సంతానంలో సరిగ్గా పదవ తరం నుండి అబ్రహాము వచ్చెను. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఈ సంతానము నుండి వచ్చెను గనుక ఇది ప్రత్యేకమైనది. అబ్రహాము నుండి మూడు జనంగారు భూమి మీదకు వచ్చాయి.వారెవరనగా ఇశ్రాయేలు, ఇష్మాయేలు, మీద్యానీయులు.
👉 *హము*
వేరుశనగ ప్రాంతంలో నివసించేవారు. వీరు మైదాన వాసులు. ఆఫ్రికా వాసులు హాము నుండి వచ్చిన వారు.
ఈ సంతానంలో నిమ్రోదు ప్రఖ్యాత నొందినవాడు."యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడిగా బిరుదు సంపాదించుకున్నాడు"
👉 హాము యొక్క నాలుగు కుమారుని పేరు *'కానాను'.* ఇతని పేరును బట్టియే పాలస్తీనాకు కానాను అని పేరు వచ్చింది. కానాను అను మాటకు "ఉదా పొడి దేశస్తులు" అని అర్థం. ఎందుకనగా పూర్వ దినాలలో కారనానీయులు ఊదా పొడిని కొన్ని రకాలైన గవ్వల నుండి తీసి చుట్టుప్రక్కల దేశాలకు అమ్మేవారు. ఈ కాలనీల నుండి పెరిజ్జీలు,హివ్వీయులు, హిత్తీయులో మొదలగు వారు వచ్చారు.
కూషు = ఇథియోపియా ప్రజల మూలపురుషుడు
మిస్రాయీము= ఈజిప్టు ప్రజలకు మూలపురుషుడు
పూతు =లిబియూ, మిగితా ఆఫ్రికా ప్రజలకు మూలపురుషుడు
కానాను =కానానీయుల ఏదో మూల పురుషుడు
👉 *యాపేతు*
యాపేతు కుమారుల నివాసం సముద్రతీర ప్రాంతాలు, ఉత్తరదృవ ప్రాంత భాగంలో ఉండే వారు.ఐరోపా వారు యాపేతు సంతానపు వారు.
👉 యాపేతు సంతతి నుండి వచ్చిన జాతుల ఎవరనగా
గోమెరు = జర్మనీ
మాగోగు,తుబాల్,మెషెక్ = రష్యా
యవాన్ = గ్రీసు
మాదయి = పర్షియా
తీరసు = ఇటలీ
తోగర్మ = అర్మేనియా
తర్షీషు = స్పెయిన్
కిత్తీము = సైప్రస్
👉👉ఈ విధంగా గమనిస్తే ఈ రోజున భూమి మీద ప్రతీ దేశం, ప్రతి జాతి, ఏవిధంగా ఉద్భవించాయో తెలియాలంటే బైబిల్ దగ్గరకు రావడం తప్పనిసరి. ప్రపంచ దేశాల ఆవిర్భావం గురించి, జాతుల గురించి ప్రజల ఆవిర్భావం మరియు వారి విధి విధానాలు గురించి బైబిల్ ఇచ్చినంత స్పష్టమైన వివరణ మరే ఇతర గ్రంథములో మనం చూడలేము. అందరి బట్టి బైబిల్ గ్రంధం మానవ చరిత్రకు ఆధారమైయున్నది. లేకపోతే ఈ జనాంగాల వివరణ మానవునికి తెలిసేది కాదు.
💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి