ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మార్టిన్ లూథర్"" గారు ఖండించిన ఒక "దుర్బోధ" (పార్ట్-1)*

*""మార్టిన్ లూథర్"" గారు ఖండించిన ఒక "దుర్బోధ" (పార్ట్-1)*

మార్టిన్ లూథర్ గారు అంటే తెలియని క్రైస్తవులు ఉండరు. ఆయన గొప్ప సంఘ సంస్కర్త, సింహపు గుండె కలిగిన ధైర్యవంతుడు.

*ఆనాడు పోపులు బైబిలు గ్రంధాన్ని దాచివేసి వాక్యాన్ని మరుగుచేసి అబద్ధపు బోధలు చేస్తున్నపుడు మార్టిన్ లూథర్ గారు ఒక్కరే నిలబడి ఆ బోధలను, పోపులను ఎదిరించి సత్య వాక్యాన్ని ప్రజలకు అందించారు.*

దాచబడిన బైబిలు గ్రంధాన్ని బయటకు తీసుకుని వచ్చి క్రైస్తవ సమాజానికి అందించారు.

*1520 సంవత్సరంలో లూథర్ గారు కొన్ని పుస్తకాలు వ్రాసి ఆనాడు క్రైస్తవ్యంలో ఉన్న కొన్ని దుర్బోదలను ఖండించారు.*

అందులో ఒక దుర్బోద కోసం తెలుసుకుందాము రండి...

*ఆనాటి పోపులు, యాజకులు క్రైస్తవ విశ్వాసులకు కొన్ని అబద్ధపు బోధలు బోధించేవారు...*
మీరు పరలోకం వెళ్ళాలి అంటే మంచిపనులు చేయాలి. మంచి పనులు చేస్తేనే పరలోకం వెళ్తాము లేకపోతే నరకానికి వెళ్లిపోతాము అని ప్రజలకు ప్రకటించేవారు.

*పోపులు, యాజకులు చెప్పిన*
*మంచిపనులు ఏమిటంటే!!!*

*1.పరిశుద్ధుల (భక్తుల) సమాధులను ముట్టుకుంటే, మంచి రోజున భక్తుల సమాధులు దర్శిస్తే పరలోకం వెళ్ళిపోతారు.*

2.రోమా నగరాన్ని దర్శించటం (వెళ్ళటం) వలన పరలోకం సులువుగా వెళ్లిపోతాము. (రోమా పట్టణం అతి పరిశుద్ధమైన పట్టణం అని పోపులు ఆనాడు గంబీరంగా చెప్పేవారు)

*3.పిలాతు గారి దగ్గరకు వెళ్ళినప్పుడు యేసుప్రభువు గారు ఎక్కిన మెట్లు ఎక్కడం వలన పరలోకం వెళ్లిపోతాము.*

4.భక్తులు వాడిన వస్తువులను, వస్త్రాలను, ముట్టుకోవడం వలన, చూడటం వలన పరలోకం వెళ్లిపోతాము.

*5.పాప పరిహార పత్రాలు కొనటం వలన, వాటిని కొంతమందికి పంచటం వలన పరలోకం వెళ్లిపోతాము...*

 6.పోపులు, యాజకులు, సేవకుల పాదముల మీద పడటం, వారిని దేవునితో సమానముగా గౌరవించడం.  పోపులు చెప్పినదే వేదం గా భావిస్తే పరలోకం వెళ్ళిపోతారు.

*ఇంకా   ఇలాంటి మరెన్నో మంచి పనులు చేస్తే పరలోకం వెళ్ళిపోతారు అని ఆనాటి పోపులు, యాజకులు క్రైస్తవ విశ్వాసులకు బోధించేవారు...*

ఈ బోధలను ఖండిస్తూ *"మార్టిన్ లూథర్" గారు ఒక పుస్తకాన్ని వ్రాసి క్రైస్తవులకు పంచిపెట్టారు.*
ఆ బుక్ పేరు
*"On Good Works"*
గూగుల్ లో సెర్చ్ చేయండి ఈ బుక్ పిడిఎఫ్ దొరుకుతుంది.

*ఒకడు క్రియల వలన, పనులు వలన కాదు విశ్వాసము వలన, దేవుని కృప వలన పరలోకం వెళ్తాడు అని లూథర్ గారు వాక్యానుసారంగా బోధించారు, పుస్తకాన్ని వ్రాసారు..*. ఆనాటి సంఘాన్ని దుర్బోద నుంచి రక్షించారు.

*ఈనాడు కూడా క్రైస్తవ సమాజంలో చాలాచోట్ల దుర్బోదలు, మూఢ నమ్మకాలు ఎక్కువ అయిపోయాయి.*

*క్రైస్తవ పుణ్యక్షేత్రములు అని పిలవబడుతున్న కొన్ని చోట్ల మోకాళ్లపై మెట్లు ఎక్కితే మంచిది, ఏమి కోరుకున్న జరిగిపోతుంది అని చెప్తున్నారు*. (చాలామంది విశ్వాసులు వందల మెట్లు మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు)

*గుండు కొట్టించుకుంటే మీ కోరికలు తీరుతాయి, పరీక్షలు పాస్ అవుతారు అని చెప్తున్నారు.*
(క్రైస్తవ పుణ్యక్షేత్రములు అని పిలవబడుతున్న కొన్ని చోట్ల)

*క్రైస్తవ పుణ్యక్షేత్రములు అని పిలవబడుతున్న కొన్ని చోట్ల చెట్లకు బొమ్మలు కడితే పిల్లలు పుడతారు అని చెప్తున్నారు*. చాలామంది విశ్వాసులు చెట్లకు బొమ్మలు కట్టి మాకు పిల్లలు పుడతారు అని నమ్ముతున్నారు (వారి విశ్వాసం క్రీస్తు మీద కాదు చెట్టు మీద)

*అదే స్థలంలో రాయి మీద రాయి పెడితే ఇల్లు కట్టుకుంటారు, మీకు ఎన్ని అంతస్థుల భవనం కావాలో అన్ని రాళ్లు ఒకదానిపై ఒకటి పెట్టండి అని బోధిస్తున్నారు.*
చాలామంది అలానే చేస్తున్నారు.

*పుణ్యక్షేత్రములు నుంచి తెచ్చిన నీరు, మట్టి, రాళ్లు మన ఇంట్లో పెట్టుకుంటే దీవెన, ఆశీర్వధములు అని బోధిస్తున్నారు.*

ఎక్కడెక్కడికో వెళ్తే పరలోకం వెళ్లినంత దీవెన, మహిమ కలిగినట్టే అని చెప్తున్నారు.

*మంచిరోజులు, శకునాలు, ముహుర్తాలు చూస్తున్నారు.*
భక్తులను, దేవదూతలను, మనుష్యులను దేవునితో సమానం చేసేస్తున్నారు..

*ఆనాడు సంఘంలో ఎలాంటి దుర్బోదలు, మూఢ నమ్మకాలు ఉన్నాయో అలాంటివే ఈనాడు క్రైస్తవ్యంలోకి చొరబడ్డాయి,* క్రైస్తవులను దారితప్పిస్తున్నాయి.

*ప్రియ చదువరీ!!!*
దుర్భోదలలో, మూఢ నమ్మకాలలో ఉన్నావా??? ఒక్కసారి పరిశీలించుకొనుము...
అటువంటి వాటికి దూరంగా ఉండు.

*క్రీస్తు మీద విశ్వాసము ఉంచు, ఆయన వలన ఆయన కృప ద్వారానే మనకు రక్షణ, పరలోకము అని మరచిపోవద్దు.*

దేవుని వాక్యము సెలవిస్తుంది.
 రోమా 1:17
*నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.*

ఎఫెసీయులకు 2:8,9
*మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.*
అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు....

1 John(మొదటి యోహాను) 4:1
*ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.* 

Matthew(మత్తయి సువార్త) 7:15
*అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.*

బైబిలు కి దగ్గరగా ఉండండి మూఢ నమ్మకాలకు కాదు.🙏

*మూఢ నమ్మకాలలో, అబద్ధ బోధలో పడిపోయిన తోటి సహోదరులను, విశ్వాసులను కూడా బయటకు లాగుదాము.*

Jude(యూదా) 1:23
*అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని(మూలభాషలో-శరీరమువలన డాగుపడిన అంగీని) అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి.*

కుదిరితే ప్రతీ ఒక్కరూ లూథర్ గారు వ్రాసిన
 *""on good works""* అనే పుస్తకాన్ని చదవండి...

*మన దేవాది దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక!!!*👏👏👏

*గమనిక:::*
మన ప్రభుని రాకడ అతి సమీపముగా ఉన్నది కాబట్టి *మనము*
*దుర్బోదలకు, మూఢనమ్మకాలకు దూరముగా ఉండి ఆయన రాకడలో ఎగిరి వెళ్లిపోదాము...*

అటువంటి భాగ్యము మన దేవాది దేవుడు మనకు దయచేయును గాక!!! ఆమేన్....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...