✳ *.....క్రిస్మస్....* ✳
(పద్నాలుగవ భాగము)
♻ *యేసుక్రీస్తు దైవత్వము* ♻
(మూడవ భాగము)
యోహాను 1: 1
*ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.*
యోహాను 1: 14
*ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.*
మనం యేసుప్రభులవారి దైవత్వం గురించి ధ్యానం చేస్తున్నాము
యేసుప్రభులవారి దైవత్వాన్ని సవాలు చేసినట్లుగా మరి ఏ దేవుణ్ణి, దేవతను ఏ దేశములో కూడా ఇంతవరకు సవాలు చేయలేదు! అందుకే పరిశుద్ధాత్ముడు ముందుగా గుర్తెరిగి, పౌలుగారిని వాడుకొని, ఆ సవాళ్లు అన్నింటికీ ధీటైన జవాబు వ్రాయించడం జరిగింది!
కొలస్సీయులకు 1: 15
*ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.*
ఈ వచనంలో ఆయన అనగా *యేసుప్రభులవారు అదృశ్యదేవుని స్వరూపి* అని రాస్తున్నారు!
దేవుడు అదృశ్యుడు!! ఆయన మన కన్నులకు కనిపించరు!!! ఒకవేళ మన కన్నులు ఆయనను, ఆయన మహిమను, ఆ కోటివేల సూర్యకాంతులను చూస్తే మన కళ్ళు పేలిపోతాయి!!
కీర్తనలు 50:2,3; ప్రకటన 4:3-5;
1తిమోతికి 6: 16
*సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్.*
*కాబట్టి మన కళ్ళతో ఆయనను చూడలేము!* యోహాను 1:18 యేసుప్రభులవారు చెబుతున్నారు:
*ఎవరూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, ఆయన కుమారుడే – లోకానికి దేవుణ్ణి బయలు పరిచాడు!*
👉 అనగా ఆయన ఎలాంటివాడు, ఆయన గుణగణాలు ఎలాంటివి లోకానికి యేసుప్రభులవారి ద్వారానే తెలిసింది!
ఇదే విషయం పౌలుగారు:
*సకల యుగములకు రాజై ఉన్నట్టియు, అక్షయుడగు అనగా క్షయము కాని వాడు, నాశనం కానివాడు, అదృశ్యుడును – అనగా ఎవరికీ కనపడని వాడునూ, ఇంకా అధ్వితీయుడునూ- అనగా ఏకైక దేవుడు, మరో దేవుడు లేదు అంటున్నారు!*
1 తిమోతీ 1:17;
ఇక 6:16 మరోసారి చూసుకుంటే
*సమీపింపరాణి తేజస్సు, అమరుడు అనగా చావులేనివాడు, మనుష్యులలో ఇంతవరకు ఎవరూ ఆయనను చూడలేదు, చూడలేడు అంటున్నారు!* అందుకే ఇలాంటి దేవుణ్ణి మోషేగారు అదృశ్యుడైనవానిని చూస్తున్నట్టుగా స్థరబుద్ధికలవాడై విశ్వసించినట్లు చూస్తాం హెబ్రీ 11:27;
👉 *ఆ తర్వాత నిజంగా మోషేగారు దేవునిమహిమను, మహిమ రూపాన్ని వెనుకనుంచి చూసారు. ఇలా ఆయన మహిమను మంటిరూపముతో చూసిన వ్యక్తి మోషేగారు మాత్రమే!*
👉 *ఆ తర్వాత దేవుడు – యేసుప్రభులవారి రూపంలో ఈలోకానికి వచ్చాక, అనేకులు దేవుణ్ణి/ యేసుప్రభులవారిని చూడగలిగారు!*
👉 ఇలాంటి అదృశ్యదేవుణ్ణి – ఆయన ఎలాంటివారో, యేసుప్రభులవారు వెల్లడిచేశారు! కారణం ఆయన మానవరూపం దాల్చిన దేవుడు!
అందుకే కొలస్సీ 2:9 లో పౌలుగారు *ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది అని నొక్కివక్కానించి యేసుప్రభులవారే దేవుడు అని చెబుతున్నారు!*
యోహాను సువార్త మొదటి అధ్యాయం జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకుంటే ఇది క్లియర్ గా అర్ధం అవుతుంది. 1:1 & 1:14 రెండూ కలిపి చదవాలి!
*ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యమే దేవుడైయుండెను. . ఇదే వాక్యము శరీరదారియై కృపా సత్యసంపూర్ణునిగా మనమధ్య నివసించుచుండెను!* –
*ఆ శరీరదారి యేసుప్రభులవారు!*
*Mathematics లో ఆల్జీబ్రా* అనే విభాగం చేసినవారికి ఇది బాగా అర్ధం అవుతుంది. ఇవో పెద్ద సమీకరణాలు! ఇలాంటివి బైబిల్ లో చాలా ఉన్నాయి గాని మచ్చుకు రెండు చూద్దాం!
1⃣ *ఆదియందు వాక్యము ఉండెను. వాక్యము= దేవుడు;వాక్యము శరీరధారియై భూలోకానికి వచ్చెను.*
👉 అలా వచ్చినది ఎవరు? *శరీరదారి= యేసుప్రభులవారు.* కావున *వాక్యము= శరీరదారి= యేసుప్రభులవారు. కాబట్టి దేవుడు = యేసుప్రభులవారు!!!*
2⃣ 2&3 వచనాలు ప్రకారం *ఆయన సృష్టికర్త!*
👉 అనగా దేవుడు. 4,5,6,9 ప్రకారం *వెలుగు ఉంది, ఆ వెలుగు లోకములో ప్రకాశిస్తుంది గాని లోకము దానిని గ్రహించలేదు!*
*యేసుప్రభులవారు నేను లోకమునకు వెలుగును అన్నారు* 8:12;
కావున *సృష్టికర్త= దేవుడు;*
*వెలుగు= ఏసుప్రభువు; వెలుగు = దేవుడు; కావున దేవుడు = యేసుప్రభులవారు!!!*
యోహాను 14:9 లో ఫిలిప్పు యేసయ్యను అడుగుతారు—
*మాకు తండ్రిని చూపించు, అంతేచాలు! అందుకు యేసుప్రభులవారు అన్నారు: ఫిలిప్పు నన్ను చూస్తే, తండ్రిని అనగా దేవుణ్ణి చూసినట్టే, కారణం మేమిద్దరం కలసి యున్నాము!*
14:20; అనగా *నేనే తండ్రి, తండ్రి= నేను, కావున తండ్రి= దేవుడు = యేసుప్రభులవారు!!*
👉 కావున ఆయనే తండ్రి, దేవుని స్వరూపం! మరొకసారి మీకు గుర్తుచేస్తున్నాను, *ఇశ్రాయేలీయులు యేసుప్రభువులవారిని ఎందుకు చంపించారు?*
1. నేను దేవుని కుమారుణ్ణి అనడం,
2. తండ్రి నేను కలసి ఉన్నాము అనడం. అంటే నేనే దేవుణ్ణి అనడం వల్లనే!!
ఇప్పడు కోతికి పిల్ల పుడితే కోతి అవుతుంది. మనిషికి పిల్ల పుడితే మనిషి అవుతాడు.
*అదే దేవుడికి కుమారుడు ఉంటే దేవుడౌతాడు.* అంతేకదా! ఈ విషయం యూదులకు తెలుసు కాబట్టి వారు మండిపడి యేసయ్యని చంపారు. ఇంత చిన్నవిషయం వీరికి తెలియకుండా పోయింది. ఇంత చిన్న లాజిక్ ప్రజలకి అర్ధం కాకుండా పోతుంది.
ఇంకా మనకు 2 కొరింథీ 4:4 లో *దేవుని స్వరూపియైన క్రీస్తుమహిమ . . .* అంటున్నారు.
*యేసుప్రభులవారు= దేవునిస్వరూపి;* ఇంకా హెబ్రీ 1:3 .హెబ్రీయులకు 1: 3
*ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక . .* చూడండి ఎంతక్లియర్ గా చెబుతున్నారో.
*కాబట్టి యేసుక్రీస్తు = దేవునిస్వరూపి = దేవుడు! ఆ నిజదేవున్ని ఎవరైతే తెలుసుకోగలరో వారు జ్ఞానము గలవారు, ధన్యులు! పరలోకానికి హక్కుదారులు!!*
అట్టి ధన్యత ప్రతీ ఒక్కరికీ కలుగును గాక!
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి