నూతన నిబంధన ఎలా తయారైందో తెలుసా?
నూతన నిబంధన గ్రంథంలో నున్న 27 పుస్తకాలు ఎలా దేవుని ఆత్మ మూలముగా ప్రేరేపించబడి వ్రాయబడెను, సమకూర్చబడెను అనుటకు ఆధారము ఏమనగా...
12 మంది శిష్యులు మరణించిన తర్వాత రోమాకు చెందిన ‘క్లెమెంట్’ నూతన నిబంధనలోని పుస్తకాలను గురించి తన గ్రంథంలో క్రీ.శ 95 సంవత్సరంలో వ్రాసెను. అలాగే ‘ఇగ్నేషియన్’ అనే భక్తుడు ఏడు పుస్తకములను గూర్చి క్రీ.శ 115లో ప్రస్తావించెను.
అపోస్తులుడైన యోహాను శిష్యుడైన ‘పోలికార్ప్’ 15 నూతన నిబంధన పుస్తకాలను దేవుని వాక్కుగా క్రీ.శ 108 సంవత్సరంలో గుర్తించెను. ఆ తర్వాత ‘ఇర్నయిస్’ 21 పుస్తకాలను తన వ్రాతలతో క్రీ.శ 185 సంవత్సరంలో ఉపయోగించెను. చివరిగా హిప్పోలిటస్ 22 పుస్తకములను దైవ ప్రేరేపిత గ్రంథములుగా క్రీ.వ 170 -235 కాలములో గుర్తించెను.
క్రీ.శ 393 ‘కౌన్సిల్ ఆఫ్ హిప్పో’ వారు నూతన నిబంధనలో 27 పుస్తకాలు దైవావేశము వలన వ్రాయబడినవే అని గుర్తించి ముద్రించిరి. అలానే క్రీ.శ. 397 ‘కౌన్సిల్ ఆఫ్ కర్తేజ్’ వారు కూడా 27 పుస్తకాలు దైవావేశముతోనే దేవుని శిష్యులు వ్రాసిరని గుర్తించింది.
_
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి