ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అపోస్తలుడు పౌలు రోమా ప్రయాణము*

*అపోస్తలుడు పౌలు రోమా ప్రయాణము*
,🎯🎯🎯🎯🎯🎯🎯
*జతపనివారు : లూకా, అరిస్తర్కు*
🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄
తేదీలు : 
🎆🎆🎆🎆🎆
క్రీ.శ. 59-62 (సుమారు రెండున్నర సంవత్సరములు) 

ప్రయాణము చేసిన దూరము :
✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️
2,130 మైళ్లు పైగా (1,920 మైళ్లు సముద్ర ప్రయాణము మరియు 210 మైళ్లు భూప్రయాణము) 

పట్టణమునకు, పట్టణమునకు మధ్య దూరము (మైళ్లలో సుమారుగా) :
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
1. యెరూషలేమునుండి కైసరయవరకు: 65

2. కైసరయనుండి సీదోనుకు 70 

3. సీదోనునుండి మూరవరకు : 500 

4. మూరనుండి కీదువరకు : 130 

5. క్నీదు నుండి సల్మోనేవరకు : 130 

6. సల్మో నేనుండి మంచిరేవులు అను స్థలమువరకు 80 : 

7. మంచిరేవులునుండి ఫీనిక్సువరకు 40 : 

8. ఫీనిక్సునుండి కౌద ద్వీపమువరకు 50 : 

9. కౌదనుండి మెలితేవరకు : 550 

10. మెలితేనుండి సురకూ సైవరకు : 85 

11. సురకూ సైనుండి రేగియువరకు : 85 

12. రేగియునుండి పొతియొలీవరకు : 200 

13. పొతియొలీ నుండి అప్పీయా సంతపేటవరకు : 100 

14. అప్పియా సంతపేటనుండి త్రిసత్రములవరకు: 10 

15. త్రిసత్రములనుండి రోమావరకు :35 
...................,..........................................
                                                    2,130 + 

రోమా ప్రయాణము : అపొస్తలుల కార్యములు 27, 28 అధ్యాయములు 
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
1. యెరూషలేము (21:27 - 23:22)
🟩🟩🟩🟩🟩🟩🟩🟩🟩🟩
గ్రీసు దేశస్థులను (త్రోఫిమును) దేవాలయములోనికి తీసికొనివచ్చి ఆ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయమునుండి అతనిని వెలుపటికి ఈడ్చి బంధించిరి.పౌలు జనసమూహముల ముందు తన పక్షమున తానే వాదించుకొనెను. మరునాడు సన్నైట్రెను సభయెదుట కూడ తన పక్షమున తానే వాదించుకొనెను. పౌలును అల్లరిజనసమూహము చంపవలెనని యత్నించుచుండగా పౌలు మేనల్లుడు రోమా అధిపతియైన శైదియ లుసియకు తెలియజేసెను. అంతట కౌదియ లుసియ పౌలును కాపాడవలెనన్న ఆలోచనతో కైసరయలోనున్న ఫొలిక్సునొద్దకు పంపెను. 

2. కైసరయ (23:23 - 27:2)
🟥🟥🟥🟥🟥🟥🟥🟥
పౌలు విచారణ నిమిత్తము మొదట ఫేలిక్సు ఎదుటను, ఆ తరువాత ఫేసు ఎదుటను ఉంచబడెను. రాజైన అగ్రిప్పకూడ పౌలు విచారణనుగూర్చి వినెను. పౌలు యెరూషలేముకు తిరిగివెళ్లి యూదులముందు విచారింపబడుటకంటె, కైసరుకు తన వాదమును విన్నవించుకొనుట మంచిదని తలంచెను. అందుచే పౌలు రెండు సంవత్సరములపాటు కైసరయలోని చెరసాలలో ఉంచబడెను. తరువాత పౌలు కైసరయను వదలి లూకా, అరిస్తర్కు యూలి అను శతాధిపతితోపాటు రోమాకు బయలుదేరెను. 

3. సీదోను (27:3)
🟪🟪🟪🟪🟪🟪
సీదోనులో పౌలు తన స్నేహితులను కలిసికొనుటకు యూలి అనుమతించెను. 

4. మూర (27:4-6)
🟧🟧🟧🟧🟧🟧🟧
సీదోనునుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున ఓడను ఉత్తరమువైపుగానున్న కుప్రచాటున నడిపించి, తరువాత కిలికియకును, పంఫూలి యకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరిరి. మూరకు చేరిన తరువాత పౌలును అతనితో కూడ ఉన్న జతపనివారును ఓడ మారిరి. 

5. క్నీదు (27:7)
🟨🟨🟨🟨🟨🟨
ఓడ అనేక దినములు నెమ్మదిగా ప్రయాణించి ఎంతో కష్టపడి క్నీదుకు చేరినది. 

6. సల్మోనే (27:7)
✳️✳️✳️✳️✳️✳️
వీరంతా ఎంతో కష్టపడి క్నీదుకు చేరిన తరువాత, ఎదురుగాలులవలన వారు దక్షిణమువైపున ఉన్న క్రేతు చాటున సల్మోనే దరికి ఓడను నడిపించిరి. 

7. మంచిరేవులు (27:8-15)
🎇🎇🎇🎇🎇🎇🎇
క్రేతుకు దక్షిణ తీరమున ఓడ ప్రయాణము బహు నెమ్మదిగా సాగెను. ఓడను లసైయ పట్టణమునకు సమీపమున లంగరు వేసిరి. శతాధిపతియైన యూలి
మరియు సువార్త ప్రయాణములు పౌలు చెప్పినది నమ్మక నావికుడును, ఓడ యజమానుడును చెప్పినది నమ్మి శీతకాలమును గడుపుటకు ఫీనిక్సునకు చేరిరి. అది నైఋతి వాయవ్యదిక్కుల తట్టునున్న క్రేతు రేవైయున్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతుదరిని ఓడ నడిపించిరి. కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతుమీదనుండి విసరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక కొట్టుకొనిపోయినది. 

8.కౌద (27:16-44)
🟫🟫🟫🟫🟫🟫🟫🟫
ఓడ గాలికి కొట్టుకొనిపోయి క్రేతులోగల కౌద అను చిన్న ద్వీపమునకు చేరినది. ఓడ బద్దలు కాకుండా నావికులు త్రాళ్లు మొదలైనవి తీసికొని ఓడను బిగించి కట్టిరి. మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు వారు ఓడలోని సరుకులను పారవేసిరి. 14 రాత్రింబవళ్ళు ఓడ గాలికి కొట్టుకొనిపోయినది. చివరికి ఓడ మెలితేయొద్ద కూరుకొనిపోయినది గాని, అందులో ప్రయాణించుచున్న 276 మంది సురక్షితముగా దరికి చేరిరి. 

9. మెలితే (28:1-11)
⬛⬛⬛⬛⬛⬛⬛⬛
అనాగరికులగు ఆ మెలితే ద్వీపవాసులు వారికి గొప్ప ఉపచారము చేసిరి. అక్కడ పౌలు చలికాచుకొనుచుండగా ఒక సర్పము అతని చేతిని పట్టినది కాని అతనికే హానియు జరుగలేదు. ఆ ద్వీపములో ముఖ్యుడైన పొప్లి స్నేహభావముతో వారికి మూడు దినములు ఆతిథ్యమిచ్చెను. పొప్లి తండ్రి జ్వరముతోను, రక్తభేది తోను బాధపడుచుండగా పౌలు ప్రార్థనచేసి అతనిని స్వస్థపరచెను. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులుకూడ వచ్చి స్వస్థత పొందిరి. పౌలును అతని జతపనివారును శీతకాలమంతయు మూడు నెలలపాటు మెలితేలో గడిపిన తరువాత అలెక్సంద్రియ పట్టణపు ఓడ ఎక్కి సురకూసైకి చేరిరి. 

10. సురకూసై (28:12)
🟦🟦🟦🟦🟦🟦🟦🟦
సురకూ సైలో ఓడ మూడు దినములు నిలిచినది. 

11. రేగియు (28:13) 

12. పొతియొలీ (28:13, 14)
💟💟💟💟💟💟💟💟
పౌలును అతని జతపనివారిని ఈ పట్టణపు సహోదరులు ఏడు దినములుండ వలెనని వేడుకొనిరి. 

13. అప్పియా సంతపేట (28:15)
💛💛💛💛💛💛💛💛💛💛
రోమానుండి కొందరు సహోదరులు వచ్చి ఈ పట్టణములో ఉన్న పౌలును కలిసికొనిరి. 

14. త్రిసత్రములు (28:15) 
🧡🧡🧡🧡🧡🧡🧡🧡
ఈ పట్టణములోను రోమానుండి కొందరు సహోదరులు వచ్చి పౌలును కలిసికొనిరి. 

15. రోమా (28:16-31) 
💚💚💚💚💚💚💚💚
పౌలు రోమాలో “గృహనిర్బంధము”నందు రెండు సంవత్సరములుంచబడెను. ఇచ్చట పౌలు యూదుల అధికారులతో సంభాషించెను.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...