ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆదాము అవ్వ పాపము చేయక పొతే మనమందరము ఏదెను వనములోనే ఉండే వారమా?

ఆదాము అవ్వ పాపము చేయక పొతే మనమందరము ఏదెను వనములోనే ఉండే వారమా? 
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
దేవుడు కలిగించిన సృష్టిలో మానవుడు చాలా గొప్పవాడు. అలాంటి ఈ సృష్టిలో మానవునితో పాటు అనేక జంతువులను సృష్టించాడు. మానవుని కంటే జంతువులే ముందుగా కలిగించే నాటి అన్నిటి కంటే వెనుక పుట్టిన మానవుడిని మాత్రము అన్నింటికీ రారాజుగా దేవుడు నియమించారు. ఏదో వనము అనేది మొట్ట మొదటి నివాసముగా మనిషికి దేవుడు ఏర్పాటు చేసాడు. ఏదెను వనము ఒక అద్భుతమైన అందమైన వనము. దానికి దేవుని తోట అనే పేరు ఉండేది. ఇక ఈ తోటలో జంతువులూ మనిషి కలిసే నివసించేవాడు. అది మనము పాఠ్య పుస్తకాలలో చదువుకున్న ఆది మానవుడు కథ కాదు. మానవుడు పాపమును ఎరుగక దేవునితో సహవాసము కలిగి ఉండేవారు. దేవుడు సమస్తాన్ని కలిగించే అన్నింటిని తినమని చెప్పాడు. కానీ ఒకేఒక్క చెట్టు ఫలమును మాత్రము తిన వద్దని చెప్పాడు.కానీ మనిషిని అపవాది మోసము చేసి తినకూడదని చెప్పిన పండును తిని పాపము చేసేలా ప్రోత్సహించబడింది. తరువాత వారు పాపములో పడి దేవునికి దూరమై పోయారు. అయితే ఈ పాపము చేయకపోతే తరువాత పుట్టిన మనము అందరమూ ఏదెనులోనే ఉండేవారమా? అని ఆలోచిస్తే .... ఇక్కడ ఒక వాక్యము చూడాలి.  

ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నింపినది లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.  

దేవుని ఉద్దేశ్యము ఒక్కటే మనుస్యులందరు ఈ భూమిని నిండించాలి. అలా నిండిన భూమిపై దేవుని ఆశలను తీర్చేవారుగా పిల్లలు ఉండాలి. వారు పరిశుద్ధులును నిర్దోషులుగా బ్రతికి తిరిగి రావాలన్నది దేవుని ఆశ. అలా ఆశించిన దేవుని ఆశను అపవాది నాశనము చేసాడు. ఒక వేళ పాపము చేయకుండా మనిషి బ్రతికి ఉంటె ఈ ప్రపంచం అంతా కూడా ఏదైనా వనములాగే ఉండేది. మనిషికి దేవునికి దూరము లేకుండా కలిసి అయనతో ప్రతి చల్ల పూట వేళ మనమంతా ఆనందించేవారము. దేవుని నివాసము మనుస్యులతో కూడా ఉండేది. మనుష్యులు ఎక్కువగా ఉండేవారు కారు. ఎందుకంటే మనుస్యులకు కామ వాంఛ ఉండేది కాదు. కేవలము దేవుని కొరకు మాత్రమే పిల్లలను కనే వారు. కానీ నేడు కామముతో కని పారేసేవారు ఎక్కువయ్యారు. దేవుని కోసం కానవలసిన మనిషి, తనకోసం కంటున్నాడు. వృద్దాప్యములో తోడుకోసం కంటున్నాడు. తన వంశాన్ని నిలబెట్టుకోవడానికి కంటున్నాడు. దేవుడు కోసం పిల్లలను కనాలని ఆయన ఆశ. అందుకే మనిషికి క్రీస్తు వారి ద్వారా మరో ఛాన్స్ ఇచ్చారు. క్రీస్తు వారి ద్వారా తనకు పిల్లలు కావాలనుకున్నాడు. క్రీస్తు మరణం ద్వార మనలను మరో జన్మ ద్వారా కన్నాడు. మనలను దత్తపుత్రులుగా వివాహం చేసుకున్నాడు. ఆయనయందు విశ్వాసముంచిన వారికి నిత్యజీవము నిస్తానని చెప్పాడు. మనమందరము ఆ జీవమును పొందుకునే వారి లెక్కలో ఉన్నాము కూడా. ఇక మానవుని ఆయుస్సు మినిమం 1000 సంవత్సరాలు ఉండేది. బాలుడు అంటే 100 సంవత్సరాల వయస్సు కలిగిన వానిగా ఉంటాడు. 1 అచ్చము 1000 యేండ్ల పాలనలో ఉండేది. మనిషికి భౌతిక మరణం ఉండకుండా హనోకు ఏలియాలవలె ఆరోహణము అయ్యే విధముగా మనిషికి ముగింపు ఉండేది. ఇవన్నీ జరగాల్సింది, కానీ జరుగలేదు. వెయ్యేండ్ల పాలనలో ఇవి జరుగబోతున్నాయి. దేవునికి స్తోత్రము. ఇక మానవుని ఆయుస్సు మినిమం 1000 సంవత్సరాలు ఉండేది. బాలుడు అంటే 100 సంవత్సరాల వయస్సు కలిగిన వానిగా ఉంటాడు. అచ్చము 1000 యేండ్ల పాలనలో ఉండేది. మనిషికి భౌతిక మరణం ఉండకుండా హనోకు ఏలియాలవలె ఆరోహణము అయ్యే విధముగా మనిషికి ముగింపు ఉండేది. ఇవన్నీ జరగాల్సింది, కానీ జరుగలేదు. వెయ్యేండ్ల పాలనలో ఇవి జరుగబోతున్నాయి. దేవునికి స్తోత్రము.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...