పౌలు జీవిత చరిత్ర:-
కిలికియాలోని తార్సు పట్టణంలో పౌలు జన్మించాడు.
తార్సు:-
తార్సు పట్టణమును అపోస్తులుడైన పౌలు గొప్ప పట్టణముగా పిలిచేను. అపో 22: 3 మరియు 11:25 పరీక్షలిస్తే, ఇది చిన్న ఆసియాదేశములోని కిలికియా అను రాష్ర్టములో ఈ తార్సు పట్టణము కలదు. కిలికియా రాష్ట్రానికి తార్సు పట్టణము రాజధానిగా ఉండేది. పౌలు నాటి కాలములో ఈ పట్టణ జనాభా సుమారు 5 లక్షల మంది అని పండితులు అంచనా వేసిరి.
ఈ పట్టణము గొప్ప పట్టణముగా ప్రసిద్ధి చెందడానికి కారణములు :-
(ఎ) ఇది వ్యాపారమునకు ప్రసిద్ధి చెందినది
(బి) కలపడం, మేక, వెంట్రుకలు, వ్యాపారము, ఎక్కువగా జరిగేది.
(సి) తార్సు పట్టణమునకు సమీపములో సిడ్నిస్ అనే నది కలదు.
(డి) ఈ నది తీరమున ఒక గొప్ప ఉండుట వలన దీని గుండా తూర్పు పడమటి దేశములకు వ్యాపారము నిత్యము పోవుచుందిరి,
అతి తక్కువకాలములో ఈ పట్టణము అభివృద్దిచెందడానికి ఇది మెుదటి కారణము.
(2) ఇది థనవంతులతో నిండిన పట్టణము
ఈ పట్టణము అభివృద్ది చెందడానికి విశేష వర్తక వ్యాపారము వలన ఈ పట్టణము ధనవంతులతో నిండియున్నది. ఈ పట్టణములో పుట్టినవాడైన పౌలు కూడా గొప్ప థనవంతుడుగా ఉండెను.
(3) ఇది వేదాంత విద్యకు అనువైన ప్రాంతము :- వేదాంత విద్యకు కూడా ఇది గొప్ప కేంద్రము ఆనాటి దినములలో తూర్పు దేశాలలో గల 3 గొప్ప కళాశాలలో ఒకటి తార్సులో ఉంది.
మిగిలిన రెండు కళాశాలలు అలెగ్జాండ్రియాలోను, ఏధేన్స్ లోను ఉన్నది. విద్యార్ధులు అనేక దేశములలో నుండి ఇచ్చుటకు వచ్చి వివిధ విద్యలలో శిక్షణ పొందుచుండెడివారు,
అందుచేతనే పౌలు కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడనని ఆ గొప్ప ఓడరేవు పట్టణపు పౌరుడనని సగౌరముగా ఈ పట్టణమును గూర్చి చెప్పుకొనెను. ఒకప్పుడు ఈ పట్టణము రోమా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తూ వారి యెక్క ఆదిపత్యములో ఉండేది. కొంతకాలము వరకు మార్కు యాంటోని అను చక్రవర్తి దీనిని స్వాతంత్ర్య దేశముగా చేసి పన్ను కట్టనవసరము లేకుండా చేసెను.
పౌలు అనుమాటకు చిన్న వాడు అని అర్థము .
క్రీ.శ 30 సం.ప్రభువైన యేసు మరణం - ఆరోహణం - ఆదరణ కర్తయైన పరిశుద్దాత్మ భూలోకానికి పంపబడడం భూటకమని భావించాడు .
పౌలు నూటికి తొంబది పాళ్ళు క్రీస్తు అని క్రిసోష్టమ్ అని పలికెను.మతోద్దారణ చరిత్ర మార్టిన్ లూథర్ లోను, హిందుదేశ స్వాతంత్ర్య తము, గాంథీజీతోను కలిసి ఉన్న క్రైస్తవ సంఘచరిత్ర క్రైస్తవ సిద్దాంతముల ప్రారంభము పౌలు అను పేరుతో పెనవేసుకొని యున్నది.
ఈ మేథావి తనకు గల సర్వశక్తులను థారబోసి 14 సంవత్సరముల కాలములోని నాలుగు రాష్ర్ట ములలో చిన్న ఆసియా, గలలియా, మకదోనియా & అకయ అను రాష్ట్రములలో సంఘములను స్థాపించడానికి స్దిరపరచగలిగాడు. ఈ పండిత శ్రేష్టుడు సంఘములకు వ్రాసిన పత్రికలు హెచ్చరికలు పరిశుద్ధ గ్రంథములో ఒక భాగమై నేటికిని సర్వలోకమునకు అనుదినము దైవసందేశము ఇచ్చుచున్నది.
ఈ భక్తునికి ఉన్న పేర్లను మనం గమనించినెడల: పరిశుద్ధుడు, పండితొత్తముడు, వీరుడు, త్యాగి, అపోస్తులుడు, ప్రవక్త, వేదాంతి వంటి పేర్లు ఈ భక్తునికి కలవు. అపోస్తులుడైన పౌలు జీవితం థ్యానించుట మనకు చాలా మంచిది.
యవ్వనమైన పౌలు :
తాను ఒక నిష్టగల పరిశుద్దుడు గాను , ఇస్రాయేలీయుడుగాను ధర్మశాస్త్రం (ఓల్డ నిబంధన) ప్రకారం అనింద్యుడిగాను జీవించి గమాలియేలు పాదాల దగ్గర వేదాంత విద్యను అభ్యసించి క్రైస్తవాన్ని రూపుమాపడం కోసం క్రైస్తవులను హింసిస్తున్నట్లుగా విశ్వసించాడు ."నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీలు పాదముల యొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై యుండి ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము దాటింది
స్తేఫేను ను రాళ్ళతో కొట్టి చంపాడు (అపో.కా 7:60) ఈ తలంపుతోనే దమస్కుకు వెళ్తూ మార్గంలో ప్రభువైన యేసు దర్శనాన్ని చూసి క్రీ.శ 32 న రక్షణ పొందాడు .
అరేబియాలో మూడేండ్లు గడిపి ప్రభువు హృదయాన్ని తెలుసుకున్నాడు .సౌలు పౌలుగా మారాడు తర్వాత తార్సుకెల్లి చాలా కాలం సిరియా, కిలికియా దేశాల్లో క్రీస్తు సువర్తను ప్రకటించాడు
పరిచర్యలో పౌలు: క్రీ.శ 46 లో అంతియోకయు సంఘంలో క్రీస్తు సువార్తకు అప్పగించబడ్డాడు.
క్రీ.శ 46-49 లోమొదటి సువార్త యాత్ర
50-53 లో రెండవ సువార్త యాత్ర మరియు
54-57 లో మూడవ సువార్త యాత్ర చేసారు .
ఆ తర్వాత యేరుషలేములో బంధించబడి రెండేళ్లు కైసరయలోని కావలిలో గడిపారు .క్రీ.శ 60 లో రోమునకు ప్రయాణం రోములో రెండేళ్ళు మొదటి చెర 61-62 కొద్ది కాలం విడిచిపెట్టబడినారు .
63-64 అనేక ప్రాంతాలు తిరిగి సువర్త ప్రకటించాడు. పిమ్మట రెండవ మారు (65-66) లో రోము చెరలో ఉన్నడు మరియు 67 లో నీరో చక్రవర్తి ద్వారా శిరచ్చేదనచేయబడి హతసాక్షి అయ్యాడు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి