బైబిల్ ఆవిర్భావం
🎯🎯🎯🎯🎯🎯🎯
క్రీ.శ. 400 సంవత్సరంలో ‘జెరోం’ అనే భక్తుడు హెబ్రీ గ్రీకు భాషలనుండి ఎంతో శ్రమకోర్చి బైబిల్ అంతటిని లాటిన్ భాషలోకి తర్జుమా చేశాడు. దీనిని ‘వల్గేట్’ అని పిలుస్తారు.
ఆ తరువాత 15 సంవత్సరాలు ఎంతో శ్రమపడి ‘జాన్ విక్లిఫ్’ మొదటిసారిగా 1383లో ఇంగ్లీష్ భాషలోనికి బైబిల్ను అనువాదం చేశాడు. దీని ఫలితంగా 1394లో విక్లిఫ్ హతసాక్షి అయ్యాడు.
1445లో ‘గూటెన్ బర్గ్’ ముద్రణాయంత్రం కనుగొని 1456లో మొదటిసారిగా లాటిన్ బైబిల్ ను ముద్రించెను. అలా ప్రంపంచంలోనే మొట్టమొదట ప్రింటైన గ్రంథంగా బైబిల్ ప్రసిద్ధి గాంచింది.
సరిగ్గా విక్లిఫ్ మరణించిన 100 సంవత్సరాలకు అనగా 1495లో ‘విలియం టిండేల్’ జన్మించాడు. ఈయన 1525లో తిరిగి ఇంగ్లీష్ అనువాదం చేశాడు.
బైబిల్ తర్జుమా చేయడం వల్ల నాటి మత ఛాదస్తవాదులు టిండేల్ను 1536లో కొయ్యకు కట్టి తారు పూసి కాల్చి చంపారు. అతని ప్రయాస, త్యాగం, మరణం ఫలితంగా 12 సంవత్సరాల తర్వాత అంటే 1548లో మొదటి ఇంగ్లీష్ బైబిల్ ముద్రించబడింది.
1778వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో ‘వాల్టేర్’ అను ఒక నాస్తికుడు ఇంకా 100 సంవత్సరాలకు బైబిల్ పూర్తిగా అంతరించి పోవునని ప్రవచించాడు. ఆ ప్రవచనముల ద్వారా బైబిల్నకు వ్యతిరేకముగా ఎన్నో బోధలు చేసి వాటిని తన ఇంటిలోనే అచ్చు యంత్రముల ద్వారా ముద్రించెను. అతని ఇల్లంతా బైబిల్కు వ్యతిరేకమైన కరపత్రములతో, పుస్తకములతో నిండి వుండెను. ఆ ప్రవచనములు నెరవేరలేదు గానీ, ఆయన చనిపోయిన తరువాత అతని ఇల్లు బైబిల్ పుస్తకశాలగాను, అతని అచ్చు యంత్రములు బైబిల్ అచ్చువేయు యంత్రములుగాను మారిపోయినవి.
దేవునికి మహీమ కలుగును గాక.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి