✨💫🌟^క్రిస్మస్* 🌟💫✨
( పదమూడవ భాగము)
*జ్ఞానులు:*
వీరు తూర్పు దేశానికి చెందిన వారు.
*రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. *(మత్తయి 2:1,2)
🐲మన జ్ఞానము దేవుని జ్ఞానమునకు అందదు. దానికి జ్ఞానులే ప్రత్యక్ష సాక్షులు.
తూర్పు దేశమునుండి బయలుదేరిన జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎడారులు, కొండలు, లోయలు, గుట్టలగుండా వారి ప్రయాణం సాగిపోతుంది. రోజులు, వారములు, నెలలు గడచిపోతున్నాయి, ఇంకా ఎంత కాలం? ఎంత దూరం ప్రయాణం చెయ్యాలో? ఈలోపు వారు యెరూషలేము చేరుకున్నారు. ఒక పెద్ద రాజభవనం వారి కంటపడింది. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
కారణం? ఈ లోక జ్ఞానం ప్రకారం రాజు, రాజు కుటుంబంలోనే జన్మిస్తాడు.
అంతవరకు నడిపించిన నక్షత్రాన్ని ప్రక్కనబెట్టి, స్వంత నిర్ణయంతో రాజ భవనంలోనికి ప్రవేశించారు. జ్ఞానులు తీసుకున్న స్వంత నిర్ణయం ఎంత మూల్యం చెల్లించిందంటే? ఆ దినాలలో రెండు సంవత్సరముల లోపు వయస్సుగల మగ పిల్లలందరినీ హేరోదు చంపించడానికి కారణమయ్యింది.
దేవుని మార్గాన్ని విడచి మనం తీసుకున్న ఎట్లాంటి నిర్ణయాలైనాసరే? మనతో పాటు మన కుటుంబం, సంఘం, సమాజం కూడా భారీమూల్యం చెల్లించాల్సిందే? కాని, వారు మార్గంతప్పినా, తిరిగి మరళా ఆనక్షత్రాన్ని అనుసరించి గమ్యం చేరుకోగలిగారు. మన జీవిత ప్రయాణంలో ఎక్కడ తప్పిపోయామో? దేనికి ఆకర్షించబడి దేవునికి దూరమయ్యామో? ఈ క్రిస్మస్ దినాలలో ఒక్కసారి మనకు మనమే పరిశీలన చేసుకుందాం! సరి చేసుకొని, మన గమ్యమైన నిత్యరాజ్యం వైపు సాగిపోదాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
https://www.facebook.com/1879080455534861/posts/3327638910679001/?d=n
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి