💠 *జీవిత చరిత్రలు* 💠
#క్రైస్తవ_ఆణిముత్యం_పులిపాక_జగన్నాధం"" గారి క్లుప్త చరిత్ర*
"పులిపాక జగన్నాధం" గారు అనే భక్తుడు దేవుని కోసం చాలా చాలా కష్టపడ్డారు, సేవచేశారు, ఎన్నో గొప్ప గొప్ప పాటలు వ్రాసారు.
అందులో కొన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో ఉన్నాయి.
ఆయన జీవితం కోసం క్లుప్తంగా తెలుసుకుందాము.
*పులిపాక జగన్నాధం గారు తూర్పుగోదావరి జిల్లా కొనసీమకు చెందిన శ్యామలదేవి అనే లంకలో పుట్టారు.*
సెప్టెంబర్ 14- 1826
*ఈయన ""వైష్టిక బ్రాహ్మణ"" కులంలో పుట్టారు.*
ఈయన తలిదండ్రులు చిన్న వయస్సు నుంచే ఈయనకు వేద మంత్రాలు, వేద గ్రంధాలు నేర్పించారు.
వీరు బాగా నిష్ఠగా ఉండేవారు..
*చదువుకోసం క్రైస్తవ మిషనేరి స్కూల్ లో చడవాల్సి వచ్చింది.* ఈయన
క్రైస్తవ ఉపాధ్యాయులను ఏదోరకంగా అవమానించినట్టు మాట్లాడేవారు...
రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేవాడు...
*గార్డెన్ దొరగారు అనే ఆయన జగన్నాధం గారికి ఒక బైబిలు ని ఇచ్చారు కానీ ఆ బైబిలుని 7సం|| పక్కన పెట్టేసారు.*
కొంతకాలం తర్వాత అనుకోకుండా మాములుగా చదువుదాం అని బైబిలు ని తీసి చదవటం ప్రారంభించారు
*అన్ని శాస్త్రాలు చదివిన జగన్నాధం గారికి బైబిలు లోని మాటలు బాగా హత్తుకున్నాయి.*
బైబిలు ని చదవటం అలవాటు చేసుకుని కాలక్రమేణా మందిరానికి వెళ్ళటం ఆరంభించి క్రైస్తవునిగా మారిపోయారు...
*ఇది తెలుసుకున్న జగన్నాధం గారి తల్లిదండ్రులు, రక్తసంబంధులు జగన్నాధం గారి మీద కోపడ్డారు, ప్రాధేయపడ్డారు, బెదిరించారు, ఆస్తిలో ఒక్క పైసా కూడా ఇవ్వము అని అన్నారు కానీ జగన్నాధం గారు దేవుని కోసం అన్ని విడిచిపెట్టేశారు...*
1847 లో ఏప్రిల్ 19 న హిందూమతాన్ని, బ్రాహ్మణ కులానికి సెలవు చెప్పి దైవ సేవకు వచ్చేసారు.
*అది తెలుసుకున్న అగ్ర కులాల వారు, బ్రాహ్మణులు తమ కులానికి అవమానం తెచ్చాడు అని పగబట్టి జగన్నాధం గారిని అనేక హింసలు పెట్టారు,* అవమానించారు...
అన్నిటికి తట్టుకుని దేవునిలో ముందుకు సాగిపోయారు జగన్నాధం గారు...
*ఈయన తన సేవలో, శ్రమలలో, ఎన్నెన్నో గొప్ప పాటలు వ్రాసారు కానీ అవన్నీ మనకు లభించలేదు కేవలం 29 పాటలు మాత్రమే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో ఉన్నాయి.*
152 పద్యాలు కూడా వ్రాసారు కానీ ఒక్కటి కూడా దొరకలేదు😔
క్రొత్తయేడు మొదలు పెట్టెను (603 కీర్తన)
హృదయమనేడి తలుపు నొద్ద (310)
నీవే నా ప్రియుడవు యేసు ప్రభు (414)
చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక (11).
*ఇలా ఎన్నెన్నో గొప్ప కీర్తనలు రచించారు.*
ఆ పాటలు ఇప్పటికి క్రైస్తవ సంఘాలలో మారుమోగుతూనే ఉన్నాయి.....
ఈయన విశాఖపట్నం లో నవంబర్ 4- 1896 లో ప్రభువునందు నిద్రించారు...
*నిష్ఠగల బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి "బైబిలు" ని చదివి క్రైస్తవునిగా మారి తలిదండ్రులు, రక్తసంబంధులతో తృణీకరింపబడి దేవుని కోసం గొప్ప సేవ చేసిన క్రైస్తవ 'ఆణిముత్యం' మన "పులిపాక జగన్నాధం" గారు..*
*మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్న నేను, నువ్వు ప్రతిరోజు మానకుండా బైబిలు చదువుతున్నామా???*
*""బైబిలు"" ని చదివి బ్రాహ్మణులు, సిక్కులు, ముస్లింలు, అనేకమంది మతాల వారు, కులాల వారు దేవునిలోకి వచ్చి గొప్ప జీవితం జీవించి మనకు మాదిరి ఉంచి వెళ్లిపోయారు.* వీరందరిని బట్టి
*""దేవునికే మహిమ కలుగును గాక""*👏👏👏
పులిపాక జగన్నాధం గారి కోసం అవసరమైతే #గూగుల్ లో చూడండి.....
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి