📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
🐍 *"పాముల ఆహారం మన్నేనా?"*💠
అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నియు మన్ను తిందువు. '' [పాములు మన్ను తినవు. చచ్చిపోయేలోగా మనము ధూళి రేణువులను తిన్నట్లే అవి కూడ తింటే తినవచ్చు. అంతమాత్రాన సర్పాలకు మన్ను ఆహారం అనలేము. యెషయా 65:25 కూడ సర్పములు మన్ను తినును అంటున్నవి]
👉 *జవాబుః*
దైవ స్వహస్తాలతో రూపించబడి దైవత్వముతో నింపబడి పరిశుద్ధులైన నరులను అపరిశుద్ధమైన వాక్కులతో మోసగించి వారిని పెడదారి పట్టించి మరణ మార్గములకు నడిపించి మరణ పాపులుగా చేసింది సర్పము. ఈ విధముగా దైవ సంభూతులైన నరజంటను శాప మరణానికి దిగజార్చినందుకు ఆది 3:14 లో వలె దేవుడు తన సన్నిధిలో పాముకు విధించిన తీర్పు మనము చదువగలము. ఇది కఠిన కారాగార శిక్ష మరియు వికలాంగత్వముతో కూడిన శిక్ష.
మట్టి తినడమంటే మనుష్యుల మధ్యలో నిర్భయంగా తిరుగవలసిన సర్పము మనుష్యులకు దూరంగా ప్రాణభయముతో మట్టి పుట్టలలో నివసించుటయే. అలాగే పాములు ఏ ఆహారమును తతినినను అవి మట్టినుండి వచ్చినవే కనుక అవి మట్టితో సమానము. ఈ లోక ఆహారము వేరు పరలోక ఆహారము వేరు. ఈ లోక ఆహారము అది ఏ రూపములో కనిపించినను అది మన్ను నుండి వచ్చినదే. చివరికి అది మన్ను గానే మారును అని ప్రసంగి చెప్పుచున్నాడు. అదే విధముగా నరులు కూడ తన ఆహారమును ఆహారము యొక్క ప్రాధాన్యతను పోగొట్టుకొని భూమిని దున్ని చెమటోడ్చి సేద్యము చేసి దాని ఫలమును తినవలసిన గతి ఏర్పడింది. ఇది సర్పజాతికిని, మానవ జాతికి కూడా దేవుడు విధించిన శిక్ష.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి